ఆరోగ్యం మీ ముంగిట్లో అనే లక్ష్యంతో ముందుకు
తాండ్రియాలలో మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం
జగిత్యాల, అక్టోబర్4,(ప్రజాకలం ప్రతినిధి)
కరీంనగర్ లోని నగునూర్ ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కథాలాపూర్ మండల కేంద్రంలోని తాండ్రియాల గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ చేన్నమ్మనేని వికాస్-దీప ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యం మీ ముంగిట్లో అనే లక్ష్యంతో మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించినట్లు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి వైద్య సేవలు అందించనున్నట్లు,సోమవారం 586 ఓ.పి చూడటం జరిగిందని, 176 మందికి పలు రకాల వైద్య పరీక్షలు మంగళవారం ఆరోగ్య రథం ద్వారా గ్రామ పంచాయతీ ఆవరణలో
నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడిల గంగా ప్రసాద్,ఎంపిపి జవ్వాజి రేవతి గణేష్, జెడ్పీటీసీ సభ్యులు నాగం భూమయ్య, ఏఏంసి చైర్మన్ వర్దినేని నాగేశ్వర్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, వైస్ ఏఎంసీ చైర్మన్ నాంపల్లి లింబాద్రి, ఇంచార్జి ఎస్ఐ అలీం ఉద్దీన్ , ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.