*క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన అదనపు ఎస్పీ రూపేష్*
*విజేతగా నిలిచిన పోలీస్ టీం*
జగిత్యాల ప్రతినిధి, మార్చి19,(ప్రజాకలం)
జగిత్యాల జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది.స్థానిక గీత విద్యాలయం మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ ప్రారంభించారు. మొదటగా అదనపు ఎస్పీ టాస్ వేయగా టాస్ గెలిచిన జిల్లా పోలీసు జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టారు. ఎస్పీ అదనపు ఎస్పీ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 3 వికెట్స్ కోల్పోయి 126పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ప్రెస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 6 వికెట్స్ ను కోల్పోయి 88 పరుగులు చేయడం తో పోలీస్ జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం విజేతలకు డీఎస్పీ లు ప్రకాష్ రవీందర్ రెడ్డి బహుమతులు అందించారు.ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పోలీస్ జట్టు నుండి రిజర్వ్ ఇన్స్పెక్టర్ వామన మూర్తి కి లభించడం జరిగింది. బెస్ట్ బ్యాట్స్ మెన్ గా ప్రెస్ టీం నుండి హైదర్ (45 పరుగులు),బెస్ట్ బౌలర్ గా పోలీస్ టీం నుండి వెంకటేష్ (3 వికెట్స్),బెస్ట్ క్యాచ్ గా రూరల్ ఎస్. ఐ అనిల్ కు లభించింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, కిషోర్,కృష్ణకుమార్, కోటేశ్వర్,శ్రీను రమణ మూర్తి, ఆర్ ఐ లు నవీన్, వమనమూర్తి, ఎస్.ఐ లు, పాత్రికేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.