ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ జి. రవి
–
జగిత్యాల,మే26,(ప్రజాకలం ప్రతినిధి)
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగకుండా తగు చర్యలు తీసుకోని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, వాహనాలు సీజ్ చేసి పెనాల్టీలు విధించాలని, సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నిర్మాణ పనులకు ఉపయోగించే విదంగా చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా లోడింగ్ ఆన్ లోడింగ్ తహసీల్దార్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాలలో రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలివరీ వివరాలు తహసీల్దార్లు రైస్ మిల్లర్ల నుండి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, ఓటర్ జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, పేర్లు వంటి వివరాలు రెండుమార్లు డూప్లికేట్ లిస్ట్ మరియు డబుల్ ఎంట్రీ లను పరిశీలించి, వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు.
ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లు పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.మండలాల్లో ఈఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల జారీ సైతం కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, నాయబ్ తసీల్దార్లు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.