ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్సై
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 05 (ప్రజా కలం): జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్సై త్రీ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ బుధవారం నాడు ఏసీబీకి చిక్కారు. ఇటీవల కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో మామిడి తోటలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. దాడుల్లో పేకాటరాయుల వద్ద రూ. 23,000 నగదు స్వాధీనం చేసుకొని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మందిలో ఏడు మంది సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసిన, అందులో బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి కి చెందిన సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదు. ఫోన్ ఇచ్చేందుకు రూ 5000 డిమాండ్ చేయగా బండారు శ్రీనివాస్ ఏసిబి అధికారులను ఆశ్రయించారు. కోరుట్లలో బండారి శ్రీనివాస్ శంకరయ్య ఎస్సై 3 కి రూ. 5000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.