అక్రమ కట్టడాలు కూల్చివేత
భీమరం ఏప్రిల్ 9 (ప్రజా కలం ప్రతినిధి)
జగిత్యాల జిల్లా భీమరం మండల కేంద్రంలోని పలు 1308 సర్వే నంబర్ లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంతమంది సంఘాల పేరిట ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు దీంతో సోమవారం రోజున భీమరం మండల కేంద్రంలోని పలు కుల సంఘాలు నాయకులు, ప్రజలు ,అందరూ కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టారు ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలని,నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేశారు. బుధవారం రోజున ఉదయం ఎమ్మార్వో రవి కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు రెవిన్యూ సిబ్బంది జెసిబితో పలు ప్రాంతాల్లో నిర్మించిన రేకుల షెడ్లు భవనాలను నెలమట్టం చేశారు ఎవరైనా మున్ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు మరియు న్యాయపరమైన కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవి కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ఆ ర్ ఐ రాజారామ్ కిరణ్ కుమార్రె వెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అక్రమ కట్టడాలు కూల్చివేత
Recent Comments
Hello world!
on