మీడియా ముందు మంచు సంచలన వ్యాఖ్యలు చేసిన
సినీ నటుడు మంచు మనోజ్
మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ ఫైల్ చేయలేదు
మహేశ్వరం, ఏప్రిల్ 09,(ప్రజా కలం)
మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ ఫైల్ చేయలేదని మంచు మనోజ్ పోలీసులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళాను.. అదేరోజు నా ఇంట్లో విధ్వంసం చేశారు.ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చొల్లను చేస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు.మాది ఆస్తి గొడవ కాదు. స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ ఇది అని అన్నారు.తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడ ఉండడం లేదు కదా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు.ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ ఫైల్ చేయలేదని తెలిపారు.
అన్ని ఆధారాలు ఉన్న కూడా చార్జ్ ఫైల్ ఉన్న కూడా ఎందుకు ఫైల్ చేయలేదు అని ప్రశ్నించారు.నేను ఊర్లో ఉన్నప్పుడు నన్ను ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్ తో ఇల్లు ధ్వంసం చేశాడని అన్నారు.రాచకొండ కమిషనర్ బైండోవర్ ను కూడా మంచు విష్ణు క్రాస్ చేశారు..మనోజ్ తప్పు అని చెప్పడానికి విష్ణు దగ్గర ఒక్క ఆధారం చూపించాలన్నారు.నా ఇల్లు ధ్వంసం చేశారు, నా కార్లు రోడ్డు మీదకు తీసుకుని వచ్చి వదిలారు. ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని అన్నారు.
కన్నప్ప పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్న అని నాపై కోపంతో ఉన్నారని అన్నారు.కూర్చుని మాట్లాడతాం అని అడుగుతున్న.. విష్ణు ముందుకు రావడం లేదని హైకోర్టు నుండి జల్పల్లి నివాసంలో ఉండటానికి నాకు ఆదేశాలు ఉన్నాయని అన్నారు.కోర్టును తప్పుదోవ పట్టించి కింది కోర్టులో తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చారని అన్నారు.తిరిగి నేను కోర్టును ఆశ్రయించడంతో కిందికోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసిందని తెలిపారు.జల్ పల్లి ఇంట్లోకి వెళ్లడానికి నాకు అన్ని అనుమతులు ఉన్న పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదని ప్రశ్నించారు.నా కుటుంబం నుండి ఒక రూపాయి తీసుకోలేదని విష్ణు కెరియర్ కోసం అమ్మాయి గెటప్ వేసాను అని తెలిపారు.నా ఇంట్లో పెట్స్ ఉన్నాయి కాళ్ళు పట్టుకుంటా ఆన్న కూడా పోలీసుల కనికరించలేదు.సీఎం డిప్యూటీ సీఎంలను అడుగుతున్న నాకు న్యాయం చేయమని
పహాడీ షరీఫ్ పోలీసులు నన్ను ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదో రాతపూర్వకంగా ఇస్తే కోర్టుకు చెప్పుకుంటా
అని అన్నారు.నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి అన్నది అతని లక్ష్యం క్యాంపస్ లో జరుగుతున్న అక్రమాలు విష్ణు దొంగతనాల గురించి ప్రశ్నించినందుకు నాపై కోపం ఉన్నారని అన్నారు.నేను కర్మ సిద్ధాంతం నమ్ముతాను.. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కర్మ అనుభవిస్తారు అని అన్నారు. నాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా మంచు మనోజ్ అన్నారు.
మీడియా ముందు మంచు సంచలన వ్యాఖ్యలు
Recent Comments
Hello world!
on