రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.
పాలేరు మార్చి 30(ప్రజా కలం న్యూస్)
రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, అల్లాహ్ దీవెనలతో నియోజకవర్గంలోని ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు.
రంజాన్ పండుగ సందర్భంగా కందాల’దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలి. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on